రాజకీయాలు ఇక కొనసాగించ లేను… మెట్రో మ్యాన్ కీలక ప్రకటన

by  |
Sreedharan
X

తిరువనంతపురం: మెట్రో‌మ్యాన్‌గా పేరొందిన శ్రీధరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీలక రాజకీయాలను నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కొన్ని నెలల క్రితం కేరళలోని పాలక్కడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఈయన ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యతుపై నిర్ణయాన్ని ప్రకటించారు. ‘నేను రాజకీయాల్లో ఉండాలనుకోవట్లేదు. ఆ సమయం గడిచిపోయింది. నేను వదులుకోలేదు. కానీ ఇంకా కొనసాగడంలో ఆసక్తి లేదు. నేను 90వ వడిలో ఉన్నాను’ అని మీడియాకు తెలిపారు. ప్రజలకు తన సేవా సంస్థల ద్వారా అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమితో కాస్త నిరాశ చెందినట్లు చెప్పారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలో లేకుండా, ఎమ్మెల్యేగా గెలిచిన ఏం చేయలేనని అన్నారు. కాగా, పాలక్కడ్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పారంబిల్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

Next Story