పూర్తి ప్యాకేజీ ప్రకటించాకే ఊర్లోకి రండి..

by  |
పూర్తి ప్యాకేజీ ప్రకటించాకే ఊర్లోకి రండి..
X

దిశ, అమరావతి బ్యూరో: వన్ టైం సెటిల్మెంట్ కింద రూ.20 లక్షలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.15 లక్షల ప్యాకేజీతో సంబంధం లేకుండా గృహ నిర్మాణం ఏర్పాటు చేయాలని వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. మార్కాపురం మండల పరిధిలో ముంపు గ్రామమైన గొట్టిపడి గ్రామంలో గ్రామసభ నిర్వహించేందుకు సోమవారం అధికారులు ఆ గ్రామానికి వచ్చారు. అయితే తమ డిమాండును పరిష్కారిస్తామని చెప్పిన తర్వాతే గ్రామంలోకి అడుగు పెట్టాలని రైతులు అధికారులను అడ్డుకున్నారు. ఊర్లోకి రాకుండా అధికారులను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.

Next Story

Most Viewed