సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ చర్చనీయాంశం

by  |
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ చర్చనీయాంశం
X

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో వివాదాలు తలెత్తాయి. నెపొటిజంపై వార్ నడుస్తోంది. బంధుప్రీతి, ఒత్తిడి వల్లే సుశాంత్ చనిపోయాడని ఓ వర్గం ఆరోపణలు గుప్పిస్తుంటే.. మరో వర్గం దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో చేతులు కలిపిన బాలీవుడ్ ప్రముఖులు తనను ప్లాన్ ప్రకారం హత్య చేయించింది ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్తుంది. దీనిపై సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వినతులు అందాయి.

ఇదిలా ఉంటే సుశాంత్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సుశాంత్ మరణం వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు పోలీసులు బాలీవుడ్ ప్రముఖులు అందరినీ వరుసపెట్టి విచారణ చేస్తుండగా..సుశాంత్ తండ్రి తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయింది. సుశాంత్‌ను తన చివరి గర్ల్ ఫ్రెండ్ ఫైనాన్షియల్‌గా మోసం చేసిందని, మెంటల్‌గా టార్చర్ చేసిందని ఆరోపిస్తూ కేసు పెట్టగా పాట్నా పోలీసులు ముంబై చేరుకుని విచారణ ముమ్మరం చేశారు.

ఈ ట్విస్ట్‌పై సుశాంత్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే తనదైన రీతిలో స్పందించింది. ట్రుత్ విన్స్ ( నిజం గెలుస్తుంది) అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ రియా పై అంకితకున్న అనుమానాన్ని తెలుపుతుండగా..కొంచెం ఆలస్యమైన సరే నిజం కచ్చితంగా బయటపడుతుంది అంటున్నారు నెటిజన్లు .

Next Story

Most Viewed