ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

by  |
ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 63,717 శాంపిల్స్ పరీక్షించగా 1,502 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,19,702 కు చేరింది. అదే సమయంలో కరోనా బారిన పడి 16మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలుపుకుని మెుత్తం కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,903కు పెరిగింది. గత 24 గంటల్లో 1,525 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌‌కాగా.. మెుత్తం ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,90,916కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో14,883 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,68,73,491 సాంపుల్స్ పరీక్షించినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

Next Story

Most Viewed