ఏయూతో ఎసీసీ MOU : వీసీ ప్రసాదరెడ్డి

by  |
ఏయూతో ఎసీసీ MOU : వీసీ ప్రసాదరెడ్డి
X

దిశ ,విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయంతో నేషనల్ కేడెట్ కార్ప్స్ (NCC) అవగాహన ఒప్పందం చేసుకుంది. మంగళవారం ఏయూ వీసీ కార్యాలయంలో వీసీ ఆచార్య పీవీ జీడీ ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్, ఎన్‌సీసీ గ్రూప్ విశాఖపట్నం కెప్టెన్ నీరజ్, సిరోహిలు సంతకాలు చేశారు. అనంతరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ.. ఎన్సీసీ అధికారులకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్‌లో పీజీ డిప్లమో సర్టిఫికేట్లు ప్రధానం చేసే దిశగా ఈ ఎంఓయూ నిలుస్తుందన్నారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్న ఎన్‌సీసీ అధికారులకు సర్వీస్ ట్రైనిగ్, ఐదేళ్ల ఉద్యోగ బాధ్యతలు పూర్తిచేసిన వారికి ఈ సర్టిఫికేట్ ను అందిస్తామన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్‌సీసీకి అందిస్తున్న ప్రోత్సాహం పట్ల గ్రూప్ కమాండర్ నీరజ్ సిరోహి సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె. సమత సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ సంచాలకులు ఆచార్య కె. నిరంజన్, అకడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఉజ్వల్ కుమార్ ఘటక్, ఎన్‌సీసీ అధికారులు డి.టి ఆంతోని, ఎండీ సజిత్, కె. జె శర్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed