Pulivendula: టీడీపీ నేత బీటెక్‌ రవికి నిరసన సెగ

by Vemula.Srinu Prasad |

వైసీపీ నేతలు టీడీపీ చేరుతున్న వేళ కడప జిల్లాలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది...

Pulivendula: టీడీపీ నేత బీటెక్‌ రవికి నిరసన సెగ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేతలు టీడీపీ చేరుతున్న వేళ కడప జిల్లాలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నేతలు పార్టీ మారకపోయినా ప్రజలు రివర్స్ అయ్యారు. దీంతో పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బీటెక్‌ రవికి నిరసన సెగ తగిలింది. కడప జిల్లా వేంపల్లి మండలం అమ్మాయిగారి పల్లెలో వైసీపీ నుంచి మూడు కుటుంబాలు టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ మూడు కుటుంబాలకు టీడీపీ కండువా కప్పేందుకు అమ్మాయిగారి పల్లెకి బీటెక్‌ రవి వెళ్లారు. అయితే గ్రామస్తుల వినూత్న నిరసన తెలిపారు. బీటెక్‌ రవి రాకను వ్యతిరేకిస్తూ ఇళ్లకు తాళాలు వేసి గ్రామస్తులు వెళ్లిపోయారు.

Next Story