Kadapa: సిరి‌బండి ఉత్సవాల్లో విషాదం.. పులివెందుల జడ్పీటీసీ మృతి

by Disha Web Desk 16 |
Kadapa: సిరి‌బండి ఉత్సవాల్లో విషాదం.. పులివెందుల జడ్పీటీసీ మృతి
X

దిశ,కడప: వైయస్సార్ జిల్లా పులివెందుల మండలం తుమ్మల పల్లెలో నిర్వహించిన సిరి‌బండి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. సిరిబండి తోలుతుండగా ప్రమాదవశాత్తు ఆ బండి కింద పడి పులివెందుల జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి మృతి చెందారు. పులివెందుల మండలం తుమ్మలపల్లి గ్రామంలో శివరాత్రి పండుగ తర్వాత గ్రామ ప్రజలు చింతల గంగమ్మ గుడికి సిరిబండి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. జడ్పీటీసీ మహేశ్వర్‌రెడ్డి సిరిబండి కింద పడ్డారు. వెంటనే అక్కడున్న వారు హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేశ్వర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మహేశ్వర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

పులివెందుల జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి సిరిబండి కిందపడి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తొండూరు వైసీపీ ఇన్చార్జ్ వైఎస్ మదనమోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గోటురు చిన్నప్ప ఆస్పత్రికి చేరుకొని మహేశ్వర్ రెడ్డి భౌతికాయాన్ని చూసి కంటతడి పెట్టారు .మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



Next Story

Most Viewed