Kadapa: భీరం శ్రీధర్ రెడ్డి స్కూలు విద్యార్థి మృతి.. ఉద్రిక్తత

by Disha Web Desk 16 |
Kadapa: భీరం శ్రీధర్ రెడ్డి స్కూలు విద్యార్థి మృతి.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఆరో తరగతి విద్యార్థి సోహెల్ మృతితో కడపలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీరం శ్రీధర్ రెడ్డి స్కూలులో సోహెల్ చదువుతున్నారు. స్కూలు హాస్టల్‌లో ఉంటూ ఆరో తరగతి చదువుతున్నారు. అయితే సోహెల్ సడెన్‌గా మృతి చెందారు. దీంతో ల్లిదండ్రులు, బంధువులు స్కూలు దగ్గర ఆందోళనకు దిగారు. సోహెల్ ఒంటిపై గాయాలున్నాయంటూ తల్లదండ్రులు ఆరోపించారు. అయితే సోహెల్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడని తల్లిదండ్రులకు స్కూలు సిబ్బంది సమాచారం ఇచ్చింది. దీంతో స్కూలు యాజమాన్యంపై సోమెల్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ చేరుకుని సోహెల్ మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూలు వద్ద పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు.


Next Story