Kadapa: అవినాష్ రెడ్డికి బెయిల్ రావడంతో మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే

by Disha Web Desk 16 |
Kadapa: అవినాష్ రెడ్డికి బెయిల్ రావడంతో మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే
X

దిశ, కడప: వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ప్రొద్దుటూరు అగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 108 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. స్థానిక మార్కెట్ యార్డు నుంచి రాజు సర్కిల్ మీదుగా శివాలయం వరకు 108 కలశాలతో 5000 మంది వైసీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే రాచమల్లు కర్ర సాము చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ అవినాష్ రెడ్డి ఎలాంటి ఆపద అన్యాయం జరగకూడదని శివపార్వతులకు మొక్కుకున్నానని తెలిపారు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి బెయిలు మంజూరు కావడంతో మొక్కు తీర్చుకున్నామన్నారు. వైయస్ అవినాష్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తుందని అప్పుడే చెప్పానన్నారు.

Next Story

Most Viewed