AP:వైఎస్ షర్మిల పై అవినాష్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!

by Disha Web Desk 18 |
AP:వైఎస్ షర్మిల పై అవినాష్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల వ్యూహాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కడపలో వైఎస్ షర్మిల, అవినాష్ రెడ్డి పోటీపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో కడప రాజకీయ పోరు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో షర్మిల గురించి అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..తన ఇద్దరు అక్కలు చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. షర్మిల, సునీత ఇద్దరూ బాబు డైరెక్షన్లో నడుచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా వైసీపీని గెలుపించాలని ప్రజలను కోరారు. తన పైన అనవసరంగా వైఎస్ వివేకా హత్య కేసు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయానికై తనను, తన తండ్రిని చాలా ఇబ్బందులకు గురి చేశారని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిజానిజాలేంటో తెలుసుకుని మాట్లాడాలని ఆరోపించారు.

Read More...

న్యాయం కోసం వివేకా రక్తం ఉక్రోషిస్తూనే ఉంది:వైఎస్ షర్మిల

Next Story