ఎన్నికల వేళ AP ప్రజలకు వైఎస్ షర్మిల సంచలన హామీ

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ AP ప్రజలకు వైఎస్ షర్మిల సంచలన హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన హామీ ఇచ్చారు. విశాఖలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు పేరుతో కాంగ్రెస్ శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కేవలం పవర్‌లోకి వచ్చిన పది రోజుల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటగా తాను చెబుతున్నానని అన్నారు. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని.. మా ప్రాణాలు అడ్డుసైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే.. మరోసారి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను అందిస్తామన్నారు. సీఎం జగన్ సిద్ధమని బయలుదేరారు.. అసలు ఆయన దేనికి సిద్ధమని ప్రశ్నించారు. సిద్ధం సభలకు ఏకంగా రూ.600 కోట్ల ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని.. ఆయన స్వప్రయోజనాల కోసమని మండిపడ్డారు.


Next Story

Most Viewed