బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ టికెట్ ఇచ్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ టికెట్ ఇచ్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సాహిస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘‘బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ టికెట్ ఇచ్చారు. హంతకులను వైసీపీ కాపాడుకుంటోంది. ఇది దురదృష్టకరం, దుర్మార్గం, అన్యాయం. హంతకులు మళ్లీ చట్టసభలోకి వెళ్లరాదు. అందుకే మీ వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. న్యాయం ఒక వైపు, అధికారం ఒక వైపు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా? న్యాయం వైపు నిలబడ్డ మీ వైఎస్ షర్మిల కావాలా? ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని, కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరినీ ఓడించాలి. వైఎస్సార్ బిడ్డను నేను.. వైఎస్సార్ ఎలా ప్రజలకు అందుబాటులో ఉండేవారో.. నేను అలాగే ఉంటా.. వైఎస్సార్‌లా సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నా’’ అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed