అన్నపై చెల్లెలు ఫైర్.. రాష్ట్రాన్ని అలా మార్చేశావంటూ ఆగ్రహం

by Disha Web Desk 16 |
అన్నపై చెల్లెలు ఫైర్.. రాష్ట్రాన్ని అలా మార్చేశావంటూ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఉండేదని, ఇప్పుడు యావత్ డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విశాఖలో డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై ఆమె స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై షర్మిల ఫైర్ అయ్యారు. గంజా, హెరాయిన్, కొకైన్ ఏది కావాలంటే అది దొరికే "ఉడ్తా ఆంధ్రప్రదేశ్"గా మార్చారని మండిపడ్డారు. ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీ వైపే ఉంటున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి 5 ఏళ్లు TDP ,తర్వాత 5 ఏళ్లు YCP మొత్తం 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్‌గా మార్చేశారని ఆరోపించారు. డ్రగ్స్ రవాణా, వాడకంలో నెంబర్ 1 ముద్ర వేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపి , వైసీపీ, బీజేపీ పార్టీలకు సిగ్గుండాలని షర్మిల వ్యాఖ్యానించారు కేంద్ర, రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయని ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా అని నిలదీశారు. కేంద్రం అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపీ "సేఫ్ హెవెన్" గా మార్చిందన్నారు. తెర వెనుక ఎంతటి వాళ్లున్నా CBI నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్‌గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు, పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని వైఎస్ షర్మిల కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Read More..

Breaking: పోలవరం జనసేన అభ్యర్థిగా బాలరాజు


Next Story