Ap Politics:యువత ఉపాధి కోసం వలస వెళ్తున్నారు: చంద్రబాబు నాయుడు

by Disha Web Desk 18 |
Ap Politics:యువత ఉపాధి కోసం వలస వెళ్తున్నారు: చంద్రబాబు నాయుడు
X

దిశ,వెబ్‌డెస్క్: రాజధాని విషయంలో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతి పూర్తి అయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేదని అన్నారు. ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. ఓటు వేసిన వారినే కాటు వేసే రకం జగన్ అని ఫైర్ అయ్యారు. నా ఎస్సీలు అంటూ వారి నెత్తి మీదే చెయ్యి పెడతారు. నాసిరకం మద్యంతో అనేక మంది చనిపోతున్నారు. అయిన పట్టించుకోవడం లేదని సీఎం జగన్ పై మండిపడ్డారు. ఐదు ఏళ్లలో పోలవరం ఎంత పూర్తి అయిందని ప్రశ్నించారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు మూడు రాజధానులు ఎలా కడతారు అంటూ ఎద్దెవా చేశారు.

Read More..

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్.. తమిళంలో స్పీచ్ అదుర్స్..


Next Story

Most Viewed