కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు వైసీపీ సరికొత్త కార్యక్రమం..

by Disha Web Desk 3 |
కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు వైసీపీ సరికొత్త కార్యక్రమం..
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులేస్తున్నారు. ఓ వైపు పార్టీ కార్యక్రమాలు, మరో వైపు ప్రభుత్వ కార్యకలాపాలు, ఇంకో వైపు ప్రయివేట్ కార్యక్రమాలతో ప్రతినిత్యం బిజీ బిజీగా గడుపుతున్నారు జగన్. ఇక రానున్న ఎన్నికల్లో గెలుపొందాలంటే కార్యకర్తల పనితీరు బావుండాలి. అయితే కార్యకర్తలు ఉల్లాసంగా ఉత్సహంగా ఉన్నప్పుడే జగన్ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనుకున్నారేమోగాని ఉన్నటుండి కార్యకర్తల్లో జోష్ పెంచడానికి ఓ కార్యక్రమాన్ని చేపట్టారు.

పరీక్షల ముందు విద్యార్థులకు ఉపాధ్యాయులు మోటివేషన్ ఇచ్చినట్టు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు మోటివేషన్ క్లాస్లు ఇప్పిస్తున్నారు. ఇందుకు గాను ప్రతి నియోజకవర్గంలో విక్తిత్వ వికాస నిపుణులతో దశానిర్దేశం చేయిస్తోంది. కష్టపడి పని చెయ్యడం.. నిజాయితితో పని చేయడం వంటి అంశాలపై ప్రసంగాలు ఇప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ఓ మోటివేటర్ జీవితాంతం సంతోషంగా ఉండేందుకు వైసీపీని అధికారం లోకి తీసుకు రావాలని పేర్కొన్నారు.




Next Story