- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Vijayasai Reddy: పెండింగ్ డిమాండ్ నెరవేరింది.. థాంక్యూ మోడీజీ
by Disha Web Desk 16 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వందే భారత్ రైలును ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ నేడు నెరవేరిందని అన్నారు. ఈ రైలు అంశాన్ని వైసీపీ ఎంపీలు పార్లమెంటులో పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారని చెప్పారు. శ్రీవారి భక్తులకు ఈ వందేభారత్ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుందని అయితే వందే భారత్ రైలుతో ఆ ప్రయాణం కాస్త ఎనిమిదిన్నర గంటలకు తగ్గుతుందని, ఇది ప్రయాణికులకుఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆర్థికాభివృద్ధికి కూడా ఇది ఎంతో తోడ్పాటునందిస్తుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story