Nara Lokesh : గర్భిణిపై వైసీపీ నేతల దాడి.. ట్విట్టర్‌లో నారా లోకేష్ సీరియస్

by Rajesh |
Nara Lokesh : గర్భిణిపై వైసీపీ నేతల దాడి.. ట్విట్టర్‌లో నారా లోకేష్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు పలు చోట్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. టీడీపీ, వైసీపీ నేతల మధ్య దాడులతో పల్నాడు సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులకు తెగబడటం భయాందోళనకు గురి చేస్తోంది. అయితే తిరుపతి జిల్లా పెళ్లకూరుమిట్టకు చెందిన గర్భణిపై వైసీపీ నేత, ఎన్ డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీకి ఓటు వేశారని దాడికి పాల్పడటంతో సదరు మహిళ శ్రీకాళహస్తి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

ఈ ఘటనపై ట్వి్ట్టర్ వేదికగా నారా లోకేష్ స్పందించారు. ‘వైసీపీ రాక్షసుల్ని ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చేసింది. టిడిపికి ఓటు వేశారనే అనుమానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణిపై వైసిపి మూకల అమానుష దాడి దారుణం. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసిపి పతనం ఖాయం. గర్భిణీకి మెరుగైన వైద్యం అందించాలి. నిందితులను అరెస్ట్ చేయాలి.’ అని ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed