బొట్టు బిళ్లల ప్రచారం! వైసీపీ పిచ్చి పీక్స్ అంటున్న టీడీపీ

by Disha Web Desk 14 |
బొట్టు బిళ్లల ప్రచారం! వైసీపీ పిచ్చి పీక్స్ అంటున్న టీడీపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో అక్కడి ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు ప్రచార జోరు పెంచారు. నేతల మధ్య తీవ్రమైన డైలాగ్ వార్ కూడా నడుస్తోంది. వైసీపీ నేతలు వినూత్న పద్దతుల్లో ప్రచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

వైసీపీ పార్టీ మహిళలు పెట్టుకునే బొట్టు బిళ్ళలు పార్టీ సింబల్ ఉన్న కవర్ ఇస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, దీర్ఘ సుమంగళీ భవ అని బోట్టు బిళ్ళల కవర్‌పై ఉంది. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా టీడీపీ పార్టీ పోస్ట్ చేసింది. ఈ ప్రచార పిచ్చి ఏందో.. ఏమో అంటూ టీడీపీ విమర్శించింది.

Next Story

Most Viewed