సంచలన పరిణామం.. పోక్సో కేసులో మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష

by Malleboina Mahesh |

ఒంగోలులో బాలికను వేధించిన కేజీబీవీ ప్రత్యేకాధికారిణికి పోక్సో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

సంచలన పరిణామం.. పోక్సో కేసులో మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పొక్సో కేసు (POCSO case) సంచలనంగా మారి.. తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ఓ మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష పడటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో కేజీబీవీ ప్రత్యేకాధికారిణి బాలికను గదిలోకి తీసుకెళ్లి ఏడుస్తుంటే కొట్టి, పోర్న్ వీడియోలు చూపించి వేధించింది. ఈ వేధింపులు భరించలేక బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు మర్రిపూడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో నేరం రుజువు కావడంతో కేజీబీవీ ప్రత్యేకాధికారినికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

Next Story