Girls missing అదృశ్యమైన ఆ నలుగురు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారంటే..

by Thanuru Gopichand |

కృష్ణా జిల్లాలో మాయమైన ఆ బాలికలు గుంటూరులో ప్రత్యక్షమయ్యారు.

Girls missing అదృశ్యమైన ఆ నలుగురు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారంటే..
X

దిశ డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లాలో మాయమైన ఆ బాలికలు(girsl missing) గుంటూరులో ప్రత్యక్షమయ్యారు. వివరాల్లోకి వెళితే గన్నవరం మండలం ముస్తాబాదుకు చెందిన నలుగురు బాలికలు బెజవాడలోని ఓ ప్రైవేటు కాలేజిలో చదువుతున్నారు. రెండు రోజుల కిందట వారు కాలేజికి ఎగ్గొట్టారు. అక్కడి నుంచి ఓ షాపింగ్​మాల్​కు వెళ్లారు. దీంతో వారిని కాలేజి యాజమాన్యం, తల్లిదండ్రులు మందలించి నట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన వారు గురువారం తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికలను హైదరాబాదు వెళుతుండగా పిడుగురాళ్ల సమీపంలో గుర్తించినట్లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తల్లిదండ్రుల ఆందోళనకు తెరపడింది.

Next Story