Eluru: నూజివీడులో విషాదం.. స్కూలు గోడ కూలి విద్యార్థి దుర్మరణం

by Disha Web Desk 16 |
Eluru: నూజివీడులో విషాదం.. స్కూలు గోడ కూలి విద్యార్థి దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏలూరు జిల్లా నూజివీడు ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. యాజమాన్యం నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. గోడ కూలి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. నూజివీడు విష్డం ప్రైవేట్ స్కూల్లో నీల మణికంఠ(4) నర్సరీ చదువుతున్నాడు. అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికంట టాయిలెట్ కోసం వెళ్లగా మరుగుదొడ్డి వద్ద గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నర్సరీ చదువుతున్న మణికంఠతోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. గోడ కూలడంతో రాళ్ల కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్న మణికంఠను చికిత్సనిమిత్తం స్థానిక మెమోరియల్ ఆసుపత్రికి యాజమాన్యం తరలించగా... చికిత్స పొందుతూ చిన్నారి మణికంఠ మృతి చెందాడు. ఈ ఘటనపై పట్టణ ఎస్ఐ శివన్నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అయితే తల్లిదండ్రులకు మణికంఠ ఒక్కడే కుమారుడు. ఉన్న ఒక్కకుమారుడు మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నూజివీడు టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆసుపత్రికి వచ్చి చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి, తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి మణికంఠ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.


Next Story

Most Viewed