Ap News: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు దుర్మరణం

by Disha Web Desk 16 |
Ap News: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తోటపేట గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న రెండు బైక్‌లు ఒకదానినొకటి ఢీ కొట్టాయి. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తోటపేట గాంధీ నగర్‌కు చెందిన గురజా సూరిబాబు (30) మరో వ్యక్తితో కలిసి హసన్‌బాద గ్రామం వైపు వెళ్తున్నారు. మరోవైపు హాసన్‌బాద నుంచి ద్రాక్షారామం వైపు పువ్వల సింహాద్రి(25) వెళ్తున్నారు. అయితే తోటపేట శివారు తోట సెంటర్ వద్ద వేగంగా రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో తీవ్ర గాయాలైన వీరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.



Next Story