- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇండో-పాక్ యుద్ధ వాతావరణం.. ఆ జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు

దిశ ప్రతినిధి, ఏలూరు: ఇండో-పాక్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఏలూరు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏలూరులోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. వాహన తనిఖీలు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పర్యవేక్షించారు. అనుమానాస్పద వాహనాలు వెంటనే సీజ్ చేయడంతో పాటు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేసి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్ లో తనిఖీలు ఐజీ, ఎస్పీ పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో తనిఖీలు నిర్వహించారు.
జాతీయ రహదారిపై కలపర్రు టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఆర్పీఎఫ్ బలగాలు, స్పెషల్ ఫోర్స్ బృందాలు, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. చింతలపూడి, కైకలూరు, పోలవరం, నూజివీడు లలో బస్టాండ్, ప్రాంగణంలో సీఐ, ఎసై ల ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ నిర్వహించాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ వారు మాట్లాడుతూ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, ప్రజల భద్రత కు జిల్లా వ్యాప్తంగా యాంటీ సబ్టజిస్ చెకింగ్ నిర్వహిస్తున్నామన్నారు. యుద్ధం సంబంధిత విషయాలో అసత్య ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా గ్రూపుల్లో అనర్హమైన సమాచారం ప్రచారం చేస్తే వాటి అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనిస్తే లో వెంటనే డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందిన 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించి విచారణ చేపడతారని హామీ ఇచ్చారు.