Breaking: ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. వృద్ధుడు సజీవ దహనం

by Disha Web Desk 16 |
Breaking: ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. వృద్ధుడు సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా ముసునూరు మండలం గొల్లపూడిలో అగ్నిప్రమాదం జరిగింది. రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.ఈ ఘటనలో వృద్ధుడు సజీవ దహనం అయ్యారు. మృతుడు పిల్లి అప్పారావుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గొల్లపూడిలో అగ్నిప్రమాదం జరిగిందని, తమకు ఫోన్ వచ్చిందని.. దాంతో ఘటన స్థలానికి వెళ్లి మంటలార్పామని అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. అయితే మంటల్లో చిక్కుకుని పిల్లి అప్పారావు మృతి చెందారని పేర్కొన్నారు. పిల్లి అప్పారావు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు.



Next Story

Most Viewed