Anakapalli: నర్సీపట్నంలో యువతి ఆత్మహత్య

by Disha Web Desk 16 |
Anakapalli: నర్సీపట్నంలో యువతి ఆత్మహత్య
X

దిశ, ఉత్తరాంధ్ర: నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డుపల్లి తెరిసా కాలనీకి చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడలో ఎమ్మెస్సీ చదువుతూ రెండు నెలలుగా ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే యువతి మానసిక సమస్యలతో బాధ పడినట్లు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తల్లి తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story