మొబిలైజేషన్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న : జిల్లా ఎస్పీ

by Disha Web Desk 18 |
మొబిలైజేషన్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న : జిల్లా ఎస్పీ
X

దిశ ప్రతినిధి, విజయనగరం: ఆర్మడ్ రిజర్వ్ మొబిలైజేషన్ ముగింపు సందర్భంగా గురువారం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పరేడ్ కు జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిథిగా హాజరై, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, మాట్లాడుతూ - కొద్ది రోజుల్లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో, ధృఢ సంకల్పంతో పని చేయాలని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో పని చేసే సిబ్బంది మరింత అప్రమత్తంగా, సమర్థవంతంగా పని చేయాలని, అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

జిల్లాల పునర్విభజన తర్వాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని, ఎంతో సంయమనంతో పని చేసి, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేసి రాబోయే ఎన్నికల్లో కూడా పని చేయాలని, శాంతియుతంగా, స్వేచ్చగా ఎన్నికల నిర్వహణకు కృషి చెయ్యాలని జిల్లా ఎస్పీ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, చర్యలు చేపట్టి దీంతో, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆస్మా ఫర్హీన్, ఎఆర్ డీఎస్పీ యూనివర్స్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, పలువురు రిజర్వు ఇన్ స్పెక్టర్లు, సిఐలు, ఆర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.


Read More..

కిలో మీటర్ రాళ్ల రంగులకు అర్థం ఇదే.. ఏ రోడ్డుకు ఏ కలర్ ఉంటుందంటే..?



Next Story

Most Viewed