Narsipatnam: అర్ధాంతరంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

by Disha Web Desk 16 |
Narsipatnam: అర్ధాంతరంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
X

దిశ, నర్సీపట్నం: మున్సిపల్ చైర్‌పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే ముగిసింది. ఎజెండా చదవడం ప్రారంభించకుండానే 26వ వార్డు టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎజెండాలోని అంశాలను తాము వ్యతిరేకిస్తున్నామని చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం మున్సిపల్ సమావేశాన్ని బాయికాట్ చేశారు.

ఆ తర్వాత జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య మున్సిపాలిటీలో అవినీతి జరిగిపోతుందంటూ మాట్లాడారు. ఆమె మాట్లాడకుండానే వైసీపీ కౌన్సిలర్లు కూడా లేచి వెళ్లిపోయారు. ఈ సమయంలో మున్సిపల్ చైర్ పర్శన్ ఆదిలక్ష్మీ ఎజెండాలో పేర్కొన్న అంశాలను ఆమోదిస్తునట్లు ప్రకటించి ఆమె కూడా సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఇలామొత్తం సమావేశం నిమిషాల వ్యవధిలో అర్ధాంతరంగా ముగిసిపోయింది. అనంతరం మున్సిపల్ కార్యాలయం బయట మీడియా ముందు తెలుగుదేశం, వైసిపి, జనసేన కౌన్సిలర్లు పరస్పరం విమర్శలు చేసుకుంటూ మీడియాతో మాట్లాడారు.



Next Story

Most Viewed