18న శృంగవరపుపేటకు చంద్రబాబు.. అలర్టైన టీడీపీ నేతలు

by Disha Web Desk 16 |
18న శృంగవరపుపేటకు చంద్రబాబు.. అలర్టైన టీడీపీ నేతలు
X

దిశ, శృంగవరపుకోట: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పర్యవేక్షణలో చంద్రబాబు పర్యటన అంశాలపై ప్రోగ్రామింగ్ కమిటీ పర్యవేక్షకులు చర్చించారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో మే18 తేదీన జరగబోయే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం గురించి సమావేశమయ్యారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై చర్చించారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో మే 18 తేదీన ఉన్న నేపథ్యంలో ప్రణాళికా ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రధానంగా చంద్రబాబు బహిరంగ సభా ప్రాంగణం యొక్క స్థలము, కొత్తూరు శివాలయం నుండి దేవి గుడి వరకు రోడ్ షో రూట్ మ్యాప్, చంద్రబాబు మే18 తేదీ రాత్రి బస చేసే శిరికి గ్రీన్ సిటీ‌లో ఉన్న రూమ్ పెసిలిటీ, ట్రాఫిక్, పోలీస్ భద్రతా నియంత్రణా చర్యలు వంటి వివిధ అంశాల మీద మరోమారు చర్చించారు. ప్రోగ్రామింగ్ కమిటీ పర్యవేక్షకులతో పాటుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, రాబిన్ శర్మ టీమ్, శృంగవరపుకోట మండలం పార్టీ అధ్యక్షులు జి.ఎస్.నాయుడు, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, విశాఖ టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి కాపుగంటి శ్రీనివాసు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ కొట్టాన విజయ్ కుమార్, రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చీపురుపల్లి సాగర్ కళ్యాణ్ పాల్గోన్నారు


Next Story

Most Viewed