Visakha: పాక్‌ జైలు నుంచి తెలుగు మత్స్యకారులకు విముక్తి

by Disha Web Desk 16 |
Visakha: పాక్‌ జైలు నుంచి తెలుగు మత్స్యకారులకు విముక్తి
X

దిశ, ఉత్తరాంధ్ర: పాకిస్తాన్‌ జైలులో ఐదేళ్ల పాటు నరకయాతన అనుభవించామని, ఇంటికి చేరుతామన్న నమ్మకం లేదని, ఇది తమకు పునర్జన్మేనని పాక్‌ బాధిత మత్స్యకారులు వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చొరవతో తమ కుటుంబ సభ్యులను చూడగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. బతుకుదెరువు కోసం రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు.. గుజరాత్‌ వలస వెళ్లి చేపల వేట చేస్తుండగా పాకిస్తాన్‌ కోస్ట్‌గార్డు చేతికి చిక్కారు. ఐదేళ్ల పాటు అక్కడ నరకయాతన అనుభవించిన ముగ్గురు మత్స్యకారులు బుధవారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.


Next Story