Visakha: తెలంగాణ సింగర్ సాయి చంద్‌‌కి ఏపీలో నివాళులు

by Disha Web Desk 16 |
Visakha: తెలంగాణ సింగర్ సాయి చంద్‌‌కి ఏపీలో నివాళులు
X

దిశ, గాజువాక: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ కళాకారుడు సాయి చంద్ ఆకస్మిక మృతి పట్ల విశాఖ ఉక్కు కర్మాగారంలోని తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కళాకారుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సాయి చంద్ లేరనే వార్త తమను కలచి వేసిందని ఆ సంఘం అధ్యక్షుడు ఎన్.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శులు జి.ఆనంద్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో ధూం ధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్య పరిచారని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక కూడా ఆంధ్ర ప్రదేశ్‌లో సాయి చంద్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారని తెలిపారు. అభ్యుదయ పాటలతో పాటు ప్రజలను మేల్కొలిపే గేయాలను ఆలపించి దళిత, బడుగు, బలహీన వర్గాలకు సాయి చంద్ చేరువయ్యారని ఎన్.కుమారస్వామి, జి.ఆనంద్ చెప్పారు.

Next Story

Most Viewed