Breaking: వ్యాన్ బోల్తా.. ముగ్గురు మృతి.. 20 మందికి గాయాలు

by Disha Web Desk 16 |
Breaking: వ్యాన్ బోల్తా.. ముగ్గురు మృతి.. 20 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొయ్యూరు మండలం మఠం భీమవరంలో అదుపు తప్పి వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. వీరందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి అసలు డ్రైవింగ్ చేయవద్దని తెలిపారు. రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.

Next Story

Most Viewed