పొత్తుల వేళ బిగ్ షాక్.. యలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం

by Disha Web Desk 16 |
పొత్తుల వేళ బిగ్ షాక్.. యలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైంది. దీంతో రాష్ట్రంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు టీడీపీ కేటాయించాల్సి వస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ కార్యాలయాలపైనే దాడులు చేస్తున్నారు. అవసరమైతే రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

తాజాగా అనకాపల్లి జిల్లా యలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, జనసేనతో పొత్తుల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. యలమంచి సీటును జనసేన ఇవ్వొదంటూఆందోళనకు దిగారు. టీడీపీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. కుర్చీలు, కిటికీలు ధ్వంసం చేశారు. జనసేనకు సీటు ఇస్తే మద్దతివ్వమని హెచ్చరించారు. అవసరమైతే పార్టీ సీనియర్ నేతలు పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యలమంచిలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed