Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ గడువు పెంపు

by Disha Web Desk 16 |
Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ గడువు పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ గడువును అధికారులు మరో 5 రోజులు పెంచారు. నేటితో ముగియనున్న నేపథ్యంలో గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు పొడిగించారు. ఇప్పటి వరకూ 22 కంపెనీలు ఈవోఐలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరిన్ని సంస్థలు పాల్గొంటాయనే సమాచారంతో ఈవోఐ గడువును పెంచినట్లు అధికారుల తెలిపారు.

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని ఏపీ రాజకీయపార్టీలతో పాటు ఇతర రాష్ట్రాల పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు తెలిపింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్ కూడా వేసింది. అధికారుల బృందాన్ని పంపి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశీలించేలా ఏర్పాట్లు కూడా చేసింది. అటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ తప్పదని కేంద్ర ఉక్కు శాఖ స్పష్టం చేసింది.

Next Story