విశాఖలో మత్తు ఇంజెక్షన్ల కలకలం.. ముగ్గురి అరెస్ట్

by Disha Web Desk 16 |
విశాఖలో మత్తు ఇంజెక్షన్ల కలకలం.. ముగ్గురి అరెస్ట్
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో మరోసారి మత్తు ఇంజెక్షన్లు కలకలం సృష్టించాయి. అల్లిపురంలో మత్తు ఇంజెక్షన్లతో పాటు గంజాయి పొగ గుప్పుమనడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేకంగా నిఘా పెట్టి సోదాలు చేశారు. దీంతో భారీగా మత్తు ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. మత్తు ఇంజెక్షన్లు, గంజాయిని ముగ్గురు యువకులు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. నిందితుల నుంచి ఇంజెక్షన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విశాఖ టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed