Pawan Kalyan: కుదిరితే వైజాగ్‌లో ఇల్లు తీసుకుంటా!

by Disha Web Desk 16 |
Pawan Kalyan: కుదిరితే వైజాగ్‌లో ఇల్లు తీసుకుంటా!
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ ప్రజలు కష్టాల్లో ఉంటే క్షణాల్లో అమరావతి నుంచి వచ్చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ విశాఖ జగదాంబ సెంటర్‌లో మాట్లాడారు. గంధపు చెట్లు నరకడం ఎంత నేరమో..డేటా సేకరణ కూడా అంతే నేరమన్నారు. ప్రజలందరం బావుండాలంటే జనసేన రావాలని.. జగన్ ఇంటికి పంపించాలని పవన్ పిలుపునిచ్చారు.

‘ఏయూలో అరాచకాలు పెరిగిపోయాయి. 29వ స్థానంలో ఉండేది. ఐదేళ్లు కాకముందే 77వ స్థానానికి వెళ్ళిపోయింది. గంజాయి అమ్ముతారు. వైసీపీ నాయకులు పుట్టిన రోజు చేసుకుంటారు. వీసీ ఓట్లు అడుగుతారు. మీరు పని చేస్తున్నది రాజకీయాల కోసమా..విద్యార్థుల కోసమా. నేను కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. ఏయూను భ్రష్టు పట్టించారు.’అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed