Chandrababu పర్యటనను అడ్డుకోవడంపై గంటా ఆగ్రహం

by Disha Web Desk 16 |
Chandrababu పర్యటనను అడ్డుకోవడంపై గంటా ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు సభలో కరెంట్ తీసేసి.. జనరేటర్లు ఎత్తుకెళ్లారని పోలీసులపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు అమానుషం అని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకోవడం దిగజారుడు తనమేనని విమర్శించారు. వైఎస్సార్, జగన్ పాదయాత్రను అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. లైట్లు ఆపేసి మైకులు లాక్కోవడం సరికాదని గంటా సూచించారు.

Next Story

Most Viewed