Visakha: ఈ ముఠా తెలివికి చాకచక్యంగా చెక్ పెట్టిన పోలీసులు

by Disha Web Desk 16 |
Visakha: ఈ ముఠా తెలివికి చాకచక్యంగా చెక్ పెట్టిన పోలీసులు
X

దిశ, ఉత్తరాంధ్ర: అల్లూరి జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా పట్టుబడింది. సుమారు రూ.3 కోట్లు విలువైన సుమారు 1700 కిలోల గంజాయిని చింతపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలిస్తున్నారు. బియ్యం బస్తాల ముసుగులో గంజాయిని ఈ ముఠా స్మగ్లింగ్ చేస్తోంది, పోలీసు చెక్‌పోస్టులనుంచి తప్పించుకునే క్రమంలో నకిలీ వే బిల్లులను ఉపయోగిస్తోంది. ఈ ముఠాలో మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఈ ముఠా తమ సాగును ఒడిశా జిల్లా మల్కన్‌గిరి, కోరాపుట్‌లలో చేస్తోంది. జోడియాపుట్ గ్రామానికి చెందిన ఖేముడు సీతారాం, పరారీలో ఉన్న మరో నిందితుడితో కలిసి గంజాయి సాగు చేస్తున్నారు. రవాణా కోసం ఉపయోగించే వాహనం యజమాని అయిన మహారాష్ట్ర రాజు, ఒడిశా నుంచి చిత్రకొండ అడవుల ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా ధారకొండ శివార్లకు తలపై మోసే కూలీల ద్వారా గంజాయిని తరలించడానికి ఆర్డర్లు ఇచ్చారు. ధారకొండ అడవుల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయిని లోడ్ చేశారు. అయినా చింతపల్లి సమీపంలో పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ ఆపరేషన్‌లో 1700 కిలోల గంజాయితో పాటు నిందితుల మొబైల్ ఫోన్లు, టాటా ట్రక్కు, బైక్, నకిలీ వే బిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed