Visakhaలో గోడల జోలికి వెళ్లొద్దు.. కఠిన ఆంక్షలు అమలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-16 13:20:46  IST  )

సుందరీకరణలో భాగంగా విశాఖపట్నంలో రోడ్ల పక్కనున్న గోడలకు వ్యాపార ప్రకటనలు, గోడ పత్రికలను అతికించరాదని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హెచ్చరించారు. ..

Visakhaలో గోడల జోలికి వెళ్లొద్దు.. కఠిన ఆంక్షలు అమలు
X

దిశ, ఉత్తరాంధ్ర: సుందరీకరణలో భాగంగా విశాఖపట్నంలో రోడ్ల పక్కనున్న గోడలకు వ్యాపార ప్రకటనలు, గోడ పత్రికలను అతికించరాదని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హెచ్చరించారు. మార్చి నెలలో విశాఖలో జి - 20 సదస్సును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందని, ఆ పనులు వేగంగా జరుగుతున్నాయన ఆమె పేర్కొన్నారు. ప్రధానంగా రోడ్లు, ఆకర్షణమైన రంగులు, గ్లేనరీ, పారిశుద్ధ్యం ఇతర ఇంజనీరింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నగరానికి ఎంతోమంది దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారని వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నగర పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందుకు అందరూ సహకరించాలని గోడలపై ఎటువంటి వ్యాపార ప్రకటనలు అతికింతరాదని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story