జనసేనకు బిగ్ షాక్..వైసీపీలోకి కీలక నేతలు

by Disha Web Desk 18 |
జనసేనకు బిగ్ షాక్..వైసీపీలోకి కీలక నేతలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: దక్షిణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీ సీనియర్ నేతలు ఆదివారం చిన్నయ్యపాలెం స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు గిరిధర్ గంపల, జి. శ్రీజ, జి. ధనుష్‌లతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనసేన మత్స్యకార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూగి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు, అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో వీరు పార్టీలో చేరారు.

Next Story

Most Viewed