Global Investors Summit: ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా: ప్రియాంక దండి

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-03 16:16:30  IST  )

వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రతిష్టత్మకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తొలి రోజు విజయవంతమయినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి అన్నారు...

Global Investors Summit: ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా: ప్రియాంక దండి
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నంలో ప్రతిష్టత్మకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తొలి రోజు విజయవంతమయినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు వెళ్లిపోయాయని ఆమె గుర్తు చేశారు. తద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పోవడంతో పాటు నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడం వల్ల యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వచ్చే ఆరు నెలల్లో గ్రౌండ్ అయితేనే ప్రజలు సీఎం జగన్ చిత్తశుద్ధిని నమ్మే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ దిశగా కష్టపడి పని చేయాలని ప్రభుత్వానికి ప్రియాంక దండి సూచించారు.

Next Story