చంద్రబాబు అరెస్ట్‌పై కేవలం వాళ్లే స్పందిస్తున్నారు..!

by Disha Web Desk 2 |
చంద్రబాబు అరెస్ట్‌పై కేవలం వాళ్లే స్పందిస్తున్నారు..!
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్న నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘కేవలం ఇండియా(I.N.D.I.A) కూటమి సభ్యులు మత్రమే చంద్రబాబుకు మద్దతిస్తున్నారు. వాళ్లే చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు ఫోన్ చేసి మద్దతు తెలుపుతున్నారు. దీంతో టీడీపీ ఎన్‌డీఐఏలో భాగమేనని రుజువైంది. కూటమి మరియు వారు ఒకే వ్యూహం కలిగి ఉన్నారు. అధికారం కోసం కలిసి రండి మరియు మీకు వీలైతే రాష్ట్రాన్ని దోచుకోండి. టీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే సామర్థ్యం లేదు’’ అని విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సీఎం జగన్ ఇలాఖాలో చంద్రబాబు అరెస్ట్ నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం గండి ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

Next Story

Most Viewed