నేడు 27 ఏళ్లుగా కొలిక్కిరాని కేసు విచారణ.. ఆఖరి నిమిషంలో ట్విస్ట్..

by Disha Web Desk 3 |
నేడు 27 ఏళ్లుగా కొలిక్కిరాని కేసు విచారణ.. ఆఖరి నిమిషంలో ట్విస్ట్..
X

దిశ వెబ్ డెస్క్: భిన్నత్వంలో ఏకత్వం అని చాటిన మనదేశంలో ఐదుగురు దళిత యువకులకు గుండు గీయించి, మీసం తీయించారు. ఈ నేపథ్యంలో ఆ యువకులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదయింది. కాగా ఈ ఘటన జరిగి 27ఏళ్ళు కావొస్తోంది. అయినా నేటికీ ఈ కేసు కొలిక్కి రాలేదు . బాధితులకు న్యాయం జరగలేదు.

వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తోంది ధర్మాసనం. అయితే ఈ రోజు ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ ఎప్పటిలానే ఈ రోజు కూడా ఈ కేసు తీర్పు వాయిదా పడింది. దీనికి కారణం విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి. తీర్పు చెప్పాల్సిన జడ్జి సెలవులో ఉన్నారు. దీనితో ఈ కేసు తీర్పు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది.

Read More..

చెక్ పోస్ట్‌ ఆకస్మిక తనిఖీ చేసిన సెబ్ అసిస్టెంట్ కమిషనర్

Next Story

Most Viewed