టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన వైకుంఠం మల్లికార్జున చౌదరి

by Dishafeatures2 |
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన వైకుంఠం మల్లికార్జున చౌదరి
X

దిశ, చిప్పగిరి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడునని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున చౌదరి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నార చంద్రబాబు నాయుడు వారి స్వగృహంలో వైకుంఠం మల్లికార్జున చౌదరి భేటి అయ్యారు. అనంతరం ఆలూరు నియోజకవర్గ రాజకీయ అంశాలపై చర్చించారు. పార్టీ పరిస్థితి పై చంద్రబాబు వైకుంఠo మల్లికార్జున చౌదరిని అడిగి తెలుసుకున్నారు. బాబు ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం చేశామని చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మల్లికార్జున చౌదరిని అభినందించారు. పార్టీ గెలుపే ధ్యేయంగా మరింత కష్టించి పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు మల్లికార్జున చౌదరి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేంద్రప్ప, రాతన మనోహర్ చౌదరి, వైకుంఠం యూత్ నాయకులు ఎస్కే జహీర్, అమర్, గణేష్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed