- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అశాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన .. మంత్రి అనగాని సత్యప్రసాద్
వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగి, చాలా సమస్యలు తలెత్తాయని రెవెన్యూ, రిజిస్ర్టేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తె లిపారు

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగి, చాలా సమస్యలు తలెత్తాయని రెవెన్యూ, రిజిస్ర్టేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprad) తెలిపారు. జిల్లాల పునర్విభజనపై (Redistribution of districts) మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఇవాళ మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల పునర్నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవన్నారు. బాపట్ల, చీరాల, రేపల్లె అనే మూడు రెవెన్యూ డివిజన్లను సవరించి అద్దంకి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం బాపట్ల కలెక్టర్ నుంచి ప్రతిపాదన వచ్చిందన్నారు. అదేవిధంగా మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నారు. ఎమ్మిగనూర్, ఉదయగిరిని రెవెన్యూ డివిజన్లుగా (Revenue Division) మార్చాలని స్థానిక శాసనసభ్యులు కోరారని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో కొత్త జిల్లాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయలేకపోయారని, వాటన్నింటినీ తాము సరిదిద్దుతున్నామని మంత్రి అనగాని వెల్లడించారు.






