Rammohan Naidu:విశాఖ-విజయవాడ విమాన సర్వీసులు పున:ప్రారంభం.. ఎప్పటి నుంచంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-05 09:42:39  IST  )

విశాఖ టు విజయవాడకు విమాన సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Rammohan Naidu:విశాఖ-విజయవాడ విమాన సర్వీసులు పున:ప్రారంభం.. ఎప్పటి నుంచంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు కేంద్రమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. విశాఖ టు విజయవాడకు విమాన సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజాగా తెలియజేశారు. ఈ క్రమంలో వచ్చే నెల(జూన్) 1 నుంచి విశాఖ-విజయవాడ విమాన సర్వీసులు పున:ప్రారంభం కానున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన వివరాలను తాజాగా ఆయన వెల్లడించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య ఉదయపు విమాన సేవలు ప్రారంభమవుతాయి. విజయవాడలో ఉదయం 7.15 గంటల నుంచి ప్రారంభమై విశాఖకు ఉదయం 8.25 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ విశాఖపట్నంలో 8.45 గంటల నుంచి 9.50 విజయవాడకు చేరుకుంటుంది.

Next Story