బిగ్ బ్రేకింగ్.. ఏపీ హైకోర్టు తరలింపు అంశంపై కేంద్రం కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-23 14:43:22  IST  )

ఏపీ హైకోర్టు తరలింపు అంశంపై కేంద్రం ప్రశ్నంచింది. హైకోర్టుకు సంబంధించి రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది...

బిగ్ బ్రేకింగ్.. ఏపీ హైకోర్టు తరలింపు అంశంపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్టు తరలింపు అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. హైకోర్టుకు సంబంధించి రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఏపీ హైకోర్టు తరలింపు ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని పేర్కొంది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటైందని తెలిపింది. హైకోర్టును సీఎం జగన్ అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ప్రతిపాదించారని వెల్లడించింది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చిందని కేంద్రం స్పష్టం చేసింది.

Also Read...

Nara Lokesh: మ‌రో 90 రోజులు సమయం ఇవ్వండి.. సీఎం జగన్‌కు లేఖ

Next Story