ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

by Naga Rani Yarlagadda |

హైవేపై రెండు కార్లు ఘోర ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ పై కారు రాంగ్ రూట్ లో వెళ్తూ ఎదురుగా వస్తున్న మరోకారును బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో రెండుకార్లు నుజ్జునుజ్జవ్వగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story