పరకామణి చోరీ కేసు.. ముగిసిన ధర్మారెడ్డి విచారణ

by Naga Rani Yarlagadda |

తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఏఈఓ ధర్మారెడ్డి విచారణ ముగిసింది.

పరకామణి చోరీ కేసు.. ముగిసిన ధర్మారెడ్డి విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఏఈఓ ధర్మారెడ్డి విచారణ ముగిసింది. బుధవారం విజయవాడలో ఉన్న సీఐడీ ఏడీజీ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను సీఐడీ అధికారులు సుమారు 5 గంటలపాటు ఈ కేసుపై ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసులో ఎవరెవరికి హస్తం ఉంది? రవి వెనుక ఎవరున్నారు? దోచిన సొమ్ములో ఎవరికెంత భాగం అందింది? ఇలా పలు అంశాలపై ధర్మారెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ధర్మారెడ్డి విచారణ ముగిసిన అనంతరం.. టీటీడీ మాజీ సీవీఎస్ఓ నరసింహ కిశోర్ విచారణకు హాజరయ్యారు. కిశోర్ ను సీఐడీ అడిషినల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు.

Next Story