- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్డంపడిన ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు
నంద్యాల చాబోలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు అడ్డంపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం వేగ ట్రావెల్స్ కు చెందిన బస్సు నెల్లూరు నుంచి కర్నూలు వైపు ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలో నంద్యాలలోని (Nandyal) చాబోలు సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఒక్కసారిగా అదుపు తప్పి అడ్డంపడింది. దీంతో బస్సు అద్దాలు పగలిపోయాయి. ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఆకస్మిక ఘటనతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ఆరుగురు ప్రయాణికులు గాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం గాయపడినవారికి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రివేళ ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు తరచూ ఫ్రెష్ అప్ అవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా పొగమంచు నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వాహనాలను నడపాలని కోరుతున్నారు.
Read More..
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా






