ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ

by Disha Web Desk 16 |
ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో పలువురు ఐఏఎస్లను బదిలీ చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్గా అనంతరామును బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా ఎండీ ఇంతియాజ్ కు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్గా లక్ష్మీషాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే రెవెన్యూ శాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఒకే విభాగంగా ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలున్నాయి. రెండు శాఖలకూ ఇప్పటివరకు ఒకే అధికారి ఉన్నారు. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలను తాజాగా సీఎస్ జవహర్‌రెడ్డికి ఏపీ ప్రభుత్వం అప్పగించింది.

ఇటీవల ఎనిమిది జిల్లాల కలెక్టర్లు సహా 56 మంది ఐఏఎస్‌ అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల ఏడీజీ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌ వరకూ స్ర్కూటినీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది ఐపీఎస్‌ అధికారులకు బదిలీ, పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చింది. అధికార పార్టీ కోసం ‘పరిధి’ దాటి పని చేసిన ఎస్సీ, బీసీ వర్గాల ఎస్పీలకు జిల్లాలు ఇవ్వకుండా షాకిచ్చిన జగన్‌..తన సొంత జిల్లా ఎస్పీని మాత్రం మూడేళ్లు దాటినా కడపలోనే ఉంచేశారు. వివాద రహితుడిగా పేరున్న దళిత డీఐజీ రవిప్రకాశ్‌ను అనంతపురం నుంచి మార్చేసి..గుంటూరు ఎస్పీగా వివాదాలతో బదిలీ అయిన అమ్మిరెడ్డికి ప్రభుత్వం అక్కడ పోస్టింగ్‌ ఇచ్చింది. పోలీసు శాఖలో డీజీపీ తర్వాత కీలకమైన శాంతి భద్రతల విభాగం ఏడీజీ పోస్టు నుంచి రవిశంకర్‌ అయ్యన్నార్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా బదిలీ


Next Story